Breaking News

మూసీ నదిలో చిక్కుకున్న మహిళను ధైర్యంగా కాపాడిన హైడ్రా బృందం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని అంబర్‌పేట్–గోల్నాక ప్రాంతంలో మూసీ నదిలో పడిపోయిన ఓ మహిళను హైడ్రా సిబ్బంది సకాలంలో స్పందించి రక్షించారు. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు నదిలో జారిపడిన ఆమె రాత్రంతా అక్కడే చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూసింది.ఉదయం స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో హైడ్రా, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుని మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.తరువాత ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.హైడ్రా వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *