మే 10, (నేటి తెలుగు పత్రిక): మదర్స్డే సందర్భంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతా వేదికగా భావోద్వేగ సందేశం పోస్టు చేస్తూ మహిళల గౌరవం, తల్లి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.“మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవ్వరూ చేయొద్దు. అదే ప్రతి తల్లి కోరుకునే గొప్ప కానుక” అంటూ లోకేశ్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానమనే భావన తనలో పెంపొందించిందీ తన తల్లేనని చెప్పారు.తన తల్లి స్ఫూర్తితోనే విద్యాశాఖలో నైతిక విలువల పాఠాలను ప్రవేశపెట్టామని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం-2’ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని గుర్తుచేశారు.“బిడ్డలకు గురువు, దైవం, మార్గదర్శి రూపంలో నిలిచే ప్రతి తల్లికి మదర్స్డే శుభాకాంక్షలు. లవ్ యూ అమ్మా” అంటూ లోకేశ్ తన సందేశాన్ని ముగించారు.
