Breaking News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు పవన్ కళ్యాణ్ స్వాగతం..

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.ఎక్స్ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారిస్తున్న ప్రధాని మోదీకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమంలో రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు కూడా వెళ్లనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *