మే 11, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో ఓబీసీ గణన చేపట్టే వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. బీసీల జనగణన డిమాండ్తో హైదరాబాద్ బాగ్అంబర్పేట్లో ఆయన రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టగా, పలువురు నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రధాని మోదీ బీసీల అంశంపై స్పందించకపోవడం బాధాకరమని వీహెచ్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గన్పార్క్ వద్ద నిరసనలు కొనసాగాయి. కులగణన చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
