Breaking News

టెక్నాలజీ ఆవిష్కరణలకు సంపూర్ణ మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

మే 11, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రజా ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సాంకేతికత సమాజ అభివృద్ధికి దారి చూపుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ప్రేరణనిచ్చేలా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ప్రపంచ స్థాయిలో భారత టెక్నాలజీ శక్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకుని దేశ అభివృద్ధికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *