Breaking News

గౌడ కార్పొరేషన్ చైర్మన్, ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు..!

విజయవాడ. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పామర్రు అసెంబ్లీ నియో జకవర్గం తోట్లవల్లూరులో కెడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఏపీ గౌడ కార్పొ రేషన్ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు వీరంకి వెంకట గురు మూర్తి లాంఛనంగా ప్రారం భించారు.ఈ సందర్భంగా వీరంకి వెంకటగురుమూర్తి మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యా ప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన చల్లని తాగునీ రు అందించడం అభినం దనీయమన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి, రైతులు, మహిళలు, సామాన్య ప్రజలకు అండగా నిలు స్తూ కెడీసీసీ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తున్న నాయకత్వం నెట్టెం రఘురాం దేనని కొనియాడారు. ప్రజాసేవ లో ఆయన చూపుతున్న అంకితభావం ప్రతి ఒక్కరి కీ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతూ సేవా కార్యక్రమాలు నిర్వ హించడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సంకల్పమ ని తెలిపారు. భవిష్యత్తు లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతా యని చెప్పారు. ఈ కార్య క్రమంలో కెడీసీసీ బ్యాంక్ మేనేజర్ పి.దీపిక, సూప ర్వైజర్ ఈ. శివ నాగ రాజు, పాక్స్ అధ్యక్షులు, బ్యాంక్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *