మే 11, (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించారు.మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో కీలక రాజకీయ తీర్మానాలు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తొలి రెండు రోజులు పార్టీ డెలిగేట్ల సమావేశాలు, మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభకు సుమారు 7 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ సుమారు 6 వేల బస్సుల్లో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మహానాడు విజయవంతానికి కార్యకర్తలు సమర్పణతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
