మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సిట్ ఈ కేసును విచారించనుంది.ఇక బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. మరోవైపు తనపై హనీట్రాప్ ప్రయత్నం జరిగిందంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు రెండు కోణాల్లో దర్యాప్తులో ఉంది.
