మే 12, (నేటి తెలుగు పత్రిక): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల స్టాళ్లను సందర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో సీఎం మాట్లాడారు.విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, సైన్స్ మోడల్స్ను పరిశీలించిన సీఎం వారి ప్రతిభను అభినందించారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న టిఫిన్స్ను మంత్రులతో కలిసి పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


