Breaking News

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. దాదాపు 28 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలుకుతూ ఆయన తన భార్యతో కలిసి అధికారుల సమక్షంలో సరెండర్ అయ్యారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 1996లో మావోయిస్టు పార్టీలో చేరినట్లు సమాచారం. విద్యార్థి దశలోనే ఎడమ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన, తర్వాత పూర్తిస్థాయి అండర్‌గ్రౌండ్ కార్యకర్తగా మారారు. క్రమంగా పార్టీ అగ్రనాయకత్వంలో కీలక స్థానానికి ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.భద్రతా బలగాల జాబితాలో అత్యంత కీలక మావోయిస్టు నేతల్లో నరహరి ఒకరిగా ఉన్నారు. ఆయన లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.ఇటీవల సరందా అడవుల్లో భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిరి బెస్ర కోసం కేంద్ర బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే నరహరి లొంగిపోయినట్లు సమాచారం.దీర్ఘకాల అజ్ఞాత జీవితం, అడవుల్లో కఠిన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి వంటి కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం నరహరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కార్యకలాపాలు, కీలక నాయకుల కదలికలు, అడవి ప్రాంతాల్లో ఉన్న దళాల వివరాలపై సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.ఇటీవలి కాలంలో ప్రభుత్వ పునరావాస విధానాలకు ఆకర్షితులై పలువురు మావోయిస్టు నేతలు, కార్యకర్తలు లొంగిపోతున్న విషయం తెలిసిందే. నరహరి సరెండర్ కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామంగా రాజకీయ, భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన బాలుడు

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *