మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఆద్విక్పై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.వేసవి సెలవుల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన బాలుడు సెల్లార్ ప్రాంతంలో ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు కుక్కలను తరిమికొట్టి బాలుడిని రక్షించారు.తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీధికుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమైందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
