మే 12, (నేటి తెలుగు పత్రిక): బంగ్లాదేశ్లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 500 రోజులకు పైగా జైలులో ఉన్న ఆయనకు వెంటనే న్యాయం చేయాలని, తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.చిన్మయ్ కృష్ణ దాస్ ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అవసరమైన వైద్యసహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులను కూడా బెదిరిస్తున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా? అని ప్రశ్నించిన పవన్, మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. హిందువులపై దాడులు, ఆలయాల ధ్వంసం వంటి ఘటనలపై అంతర్జాతీయ సమాజం మౌనం వీడాలని అన్నారు.ఆధ్యాత్మిక గురువును నేరస్థుడిలా చూడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్మయ్ కృష్ణ దాస్కు కనీస మానవ హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
