Breaking News

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర చర్చకు దారితీసిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మే 3న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అనుమానాస్పద మార్కులు, నిర్వహణలో లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.పరీక్ష పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకుని, మొత్తం పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.పరీక్ష నిర్వహణలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు సమాచారం. పరీక్షకు సంబంధించిన డిజిటల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, సర్వర్ వివరాలు తదితర రికార్డులను దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని ఎన్టీఏ పేర్కొంది.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం సిద్ధమవగా, అకస్మాత్తుగా పరీక్ష రద్దు కావడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. మరోసారి పరీక్షకు సిద్ధమవాల్సి రావడం మానసిక ఒత్తిడిని పెంచుతోందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎన్టీఏ తెలిపింది. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్త పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

ప్రభుత్వం ముందుగా ఖర్చులు తగ్గించాలి: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *