Breaking News

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన లోపాలు విద్యా వ్యవస్థలోని తీవ్రమైన సమస్యలను బయటపెట్టాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయని పార్టీ పేర్కొంది.దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు సుమారు 1.30 లక్షలే ఉండటంతో తీవ్ర పోటీ పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొంటున్నారని తెలిపింది.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు వరుస ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్య వ్యాపారంగా మారిందని పార్టీ ఆరోపించింది. విద్యార్థుల భవిష్యత్తు కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది.నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ మండిపడింది. పరీక్షల పారదర్శకతను కాపాడడంలో నిర్లక్ష్యం జరిగిందని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని, విద్యా రంగంలో కార్పొరేట్ దోపిడీని నియంత్రించాలని సిపిఐ కోరింది. అలాగే విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శకమైన, ప్రభుత్వ ఆధారిత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *