మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు వారి పూర్తి వివరాలను సమీప పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.నేపాల్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పని మనుషుల ఫొటోలు, చిరునామాలు, గుర్తింపు వివరాలు పోలీసులకు అందజేయాలని అధికారులు తెలిపారు. ఈ విధంగా ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా దోపిడీలు, దాడులు వంటి నేరాలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఇంటి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు. అప్రమత్తత లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
