మే 12, (నేటి తెలుగు పత్రిక): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్తో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఆందోళనలో రైల్వే రవాణాకు అంతరాయం కలిగిందని రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ ఘటన కారణంగా నిజామాబాద్–హైదరాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.రైల్వే చట్టం సెక్షన్ 147, 174(a) కింద కవితతో పాటు మరో 12 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. రైల్ రోకో కారణంగా దేవగిరి ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.ఈ కేసులో రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో విచారణ జరగనుంది. కవితతో పాటు ఇతర నేతలు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా వేడెక్కిన నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
