మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఈ జాబితా ఆధారంగా ప్రభుత్వం డివిజన్లు, వార్డుల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఏడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా, ఎన్నికలపై అధికారిక ప్రకటన కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
