Breaking News

సరస్వతి అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *