మే 19, (నేటి తెలుగు పత్రిక): మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో పాటు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.పోర్టుల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. డ్రెడ్జింగ్, బ్రేక్వాటర్ నిర్మాణం, పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.మూలపేట గ్రామ పునరావాస పనులు పూర్తిచేసి డ్రెడ్జింగ్ను వేగవంతం చేయాలని, మచిలీపట్నం పోర్టులో కీలక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ల పనులను కూడా గడువులోగా పూర్తి చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.
