మే 19, (నేటి తెలుగు పత్రిక): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర సాగునీటి రంగానికి గణనీయమైన లాభాలు చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.సోమవారం వెలగపూడి సచివాలయంలో కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. నదుల అనుసంధానానికి కేఎల్ రావు ఆద్యుడని కొనియాడిన ఆయన, దేశంలో నదుల అనుసంధానం అవసరాన్ని ముందుగానే ఆయన ప్రతిపాదించారని గుర్తు చేశారు.గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్రానికి కీలక ప్రయోజనాలు అందించిందని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన తెలిపారు.
