Breaking News

నకిలీ మద్యం కేసు: తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో 25 మందిపై అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు.అలాగే 89 మందిని సాక్షులుగా చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏ1 జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలను నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ తెలిపింది.వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సహకారంతోనే ఈ కల్తీ మద్యం తయారీ జరిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

జగన్‌పై షర్మిల విమర్శల వెల్లువ

సముద్ర భద్రతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అనుమానాస్పద బోట్లపై నిఘా పెంచాలని సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *