మే 19, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శన చేపట్టారు. తమ సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మత్స్యకారులు పేర్కొన్నారు.వేట నిషేధ కాలంలో ఇబ్బందులు పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించగా, ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల సాయం అందించనున్నారు.రెండేళ్లలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా మొత్తం రూ.505 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
