మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని కవాడిగూడ ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రత్నదీప్ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలనలు చేపట్టారు. అపార్ట్మెంట్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.మృతురాలు ఎవరు? హత్యకు కారణం ఏమిటి? నిందితుడు పరిచయస్తుడేనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
