Breaking News

టీడీపీ అబద్ధాలు చెప్పదు, ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 19, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాల కోసం పని చేయదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అవసరమైన పనులనే ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, మత్స్యకారులు టీడీపీతో కుటుంబ సభ్యుల్లా ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు ఎదురైనా పార్టీ నిలబడిందని అన్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు.చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. గత ఐదేళ్లలో సబ్సిడీలు, బీమా, ఆయిల్ సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల మరబోట్ల అక్రమాలను నియంత్రించామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

జగన్‌పై షర్మిల విమర్శల వెల్లువ

సముద్ర భద్రతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అనుమానాస్పద బోట్లపై నిఘా పెంచాలని సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *