Breaking News

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మరో 390 అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం.ఇటీవల ఓ అమెరికా పౌరుడికి కూడా ఎబోలా సోకినట్లు నిర్ధారణ కావడంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కాంగో, ఉగాండా దేశాల పౌరులపై అమెరికా పలు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య నిపుణులను ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది.ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా భావిస్తారు. జ్వరం, తీవ్రమైన బలహీనత, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

స్వీడన్ అత్యున్నత గౌరవం అందుకున్న ప్రధాని మోదీ

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *