Breaking News

ఖమ్మంలో సంచలనం.. మహిళను మోసం చేసిన సీఐపై కేసు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మంలో సీఐపై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భర్త వేధిస్తున్నాడని న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను అదే సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.వివరాల ప్రకారం, 2023లో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో సీఐ భూక్యా రాజు నాయక్ పరిచయం పెంచుకున్నాడు. న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్, మెసేజ్‌ల ద్వారా దగ్గరయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా, తర్వాత బలవంతంగా గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి విషయాన్ని దాటవేయడంతో బాధితురాలు ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐపై కేసు నమోదు చేసి, అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు.బాధితురాలికి ఇటీవల కోర్టు ద్వారా విడాకులు మంజూరైనట్లు కూడా సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *