మే 22, (నేటి తెలుగు పత్రిక): క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిత.. ఈ ఘటనలో రాజకీయ కోణం ఉందా అనే అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. గిరిజనులను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.అభినయ్ దర్శన్పై ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని హోం మంత్రి తెలిపారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు.ఈ కేసులో నిజానిజాలు త్వరలో బయటపడతాయని, అవసరమైతే అభినయ్ దర్శన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామని మంత్రి అనిత వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
