మే 27, (నేటి తెలుగు పత్రిక): నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం నేడు, రేపు నిర్వహించనుంది. కార్యకర్తలు పండుగలా జరుపుకునే ఈ మహానాడును ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా వర్చువల్ పద్ధతిలో నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా 1,800 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.ఈ మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మహిళా శక్తి, రైతులు, యువత, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
