మే 27, (నేటి తెలుగు పత్రిక): చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు కంటెంట్ ప్రసారం చేశారని ఆరోపిస్తూ న్యాయవాది రామకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుతో పాటు సంబంధిత వీడియోలు, స్క్రీన్షాట్లను కూడా పోలీసులకు అందజేశారు. కోర్టు అనుమతి అనంతరం ఆ యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ కంటెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
