జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సత్యవరం గ్రామానికి చేరుకున్న ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.
అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీరాంపురం గ్రామంలో బొడ్డపాటి వీరాస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఇటీవల అకాల వర్షాల కారణంగా మృతి చెందిన అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబాలను కూడా హోం మంత్రి సందర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
