Breaking News

Strict action against hospitals dealing in organs

అవయవాలపై వ్యాపారం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు

అవయవదానం పై అవగాహన కార్యక్రమం – ఏపీ మంత్రి సత్యకుమార్ పిలుపు

గుంటూరు: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు, గుంటూరు మెడికల్ కాలేజీ లో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అవయవదానం చేయడం అనేది సాయానికి మార్గం, కాబట్టి ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు ఐదు బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని, అవయవదానం ద్వారా రోగులకు జీవితం ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.

అవయవాలపై వ్యాపారం చేసేందుకు ఇష్టపడే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. “పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందంటూ,” మంత్రి పేర్కొన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *