Breaking News

BJP National Vice President DK Aruna visited Vijayawada Kanakadurgamma

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న డీకే అరుణ

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

విజయవాడ: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబసమేతంగా దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం నాకు ఎంతో సంతోషాన్ని అందించింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రావాలని అనుకున్నా, మధ్యలో వరదల కారణంగా ఆలస్యం అయ్యింది,” అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“అమ్మవారి ఆశీర్వాదం నాకు విజయాన్ని అందించిందని భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో గాను ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది,” అని ఆమె అన్నారు.

ప్రాంతీయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, “తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, అన్ని ప్రాంతాలకు మంచి జరగాలి,” అని పేర్కొన్నారు. “ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో మంచి అభివృద్ధి జరుగుతోంది. ఎన్డీఏ లో ఉన్న సీఎం మరియు ఈ ప్రాంతం ఎమ్మెల్యే సుజన చౌదరి గారు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు,” అని డీకే అరుణ తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మను దర్శించుకున్న డీకే అరుణకి ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం, వేదపండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్న ఆమె, లడ్డూ ప్రసాదం మరియు అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఇన్‌చార్జ్ ఈవో రామచంద్ర మోహన్ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *