Breaking News

We are depositing grain money within 24 hours

24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాం

24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాం – మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని, కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయిస్తున్నామని తెలిపారు.

27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఆదివారం నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుండి మొత్తం 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఆయన, కూటమి ప్రభుత్వం చేపట్టిన వేగవంతమైన సేకరణ, పేమెంట్ల విధానాన్ని వివరించారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

రైతుల ఖాతాల్లో రూ.6,083.69 కోట్లు జమ
“ధాన్యం సేకరించిన వెంటనే, అంటే 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.6,083.69 కోట్లు నేరుగా జమ చేశాం,” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం సేకరించారని విమర్శిస్తూ, అప్పటి ప్రభుత్వం డబ్బుల చెల్లింపులో విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంక్రాంతి సందడి తెచ్చిన కూటమి ప్రభుత్వం
“రైతుల కుటుంబాల్లో ఈ సంక్రాంతి పండగ ఆనందం వెల్లువెత్తేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. వైకాపా హయాంలో అజమాయిషీ కంటే, ఇప్పుడు సరైన పద్ధతిలో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపు జరుగుతోంది,” అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

రైతులకు మద్దతుగా ప్రభుత్వ చర్యలు
రైతుల సంక్షేమం కే కేంద్రంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యలు రైతాంగానికి ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా, వ్యవసాయ రంగానికి నూతన ఉత్తేజం ఇవ్వడంలో కీలకంగా నిలుస్తాయని అన్నారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *