Breaking News

Difficult for BRS leaders to digest: Satires of Congress leaders

బీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడం కష్టం: కాంగ్రెస్ నేతల సెటైర్లు

బీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడం కష్టం: కాంగ్రెస్ నేతల సెటైర్లు

హైదరాబాద్: దావోస్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులకు మందులు పంపిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

ఈనో పంపిన కాంగ్రెస్ నేతలు:
నిన్నటివరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు పంపి జీర్ణకోశ సమస్యలు తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాదు, హైదరాబాద్‌లో భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేసి వ్యంగ్యప్రచారం చేశారు.

టానిక్ సిరప్, ట్యాబ్లెట్లు పంపిన మెట్టు సాయి కుమార్:
తాజాగా కాంగ్రెస్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నేతలపై మరింత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు, ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావులకు ప్రత్యేకంగా టానిక్ సిరప్, ట్యాబ్లెట్లు పంపించారు. “బీఆర్ఎస్ నేతలకు జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దావోస్ పెట్టుబడులు జీర్ణించుకోలేక ఇబ్బంది పడతారు,” అని సెటైర్లు విసిరారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

త్రీ టైం డోసు సూచన:
అతిథులు మాట్లాడుతూ, “ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు ఈ మెడిసిన్ తీసుకోవాలని సూచించాం,” అని వ్యాఖ్యానించారు. ఈ టానిక్, ట్యాబ్లెట్లతో వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *