బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడం కష్టం: కాంగ్రెస్ నేతల సెటైర్లు

బీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడం కష్టం: కాంగ్రెస్ నేతల సెటైర్లు

Difficult for BRS leaders to digest: Satires of Congress leaders

బీఆర్ఎస్ నేతలకు జీర్ణం కావడం కష్టం: కాంగ్రెస్ నేతల సెటైర్లు

హైదరాబాద్: దావోస్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులకు మందులు పంపిన వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈనో పంపిన కాంగ్రెస్ నేతలు:
నిన్నటివరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు పంపి జీర్ణకోశ సమస్యలు తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాదు, హైదరాబాద్‌లో భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేసి వ్యంగ్యప్రచారం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

టానిక్ సిరప్, ట్యాబ్లెట్లు పంపిన మెట్టు సాయి కుమార్:
తాజాగా కాంగ్రెస్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నేతలపై మరింత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు, ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావులకు ప్రత్యేకంగా టానిక్ సిరప్, ట్యాబ్లెట్లు పంపించారు. “బీఆర్ఎస్ నేతలకు జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దావోస్ పెట్టుబడులు జీర్ణించుకోలేక ఇబ్బంది పడతారు,” అని సెటైర్లు విసిరారు.

త్రీ టైం డోసు సూచన:
అతిథులు మాట్లాడుతూ, “ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు ఈ మెడిసిన్ తీసుకోవాలని సూచించాం,” అని వ్యాఖ్యానించారు. ఈ టానిక్, ట్యాబ్లెట్లతో వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎద్దేవా చేశారు.