Breaking News

Governor Justice Abdul Nazir unfurled the national flag

జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

గవర్నర్ తన ప్రసంగంలో రాజ్యాంగ పునాది విలువలను గుర్తు చేస్తూ, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రాంతీయ స్థాయిలో కూడా వేడుకలు ఆహ్లాదకరంగా కొనసాగుతున్నాయి.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *