Breaking News

Republic celebrations were held in high court

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ

హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తల కృషిని స్మరించుకున్న జస్టిస్ సుజయ్ పాల్, “రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు, దాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత” అని తెలిపారు.

పెండింగ్ కేసులపై ఆందోళన
జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ, పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు సవాల్‌ లాంటివని పేర్కొన్నారు. “2023 జనవరిలో 2.31 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం వాటిని 2.29 లక్షలకు తగ్గించాం. ఇది న్యాయమూర్తులు, న్యాయవాదుల కృషితో సాధ్యమైంది” అని వివరించారు.

తాసిల్దార్ కు సన్మానం.

లోక్ అదాలత్ విజయాలు
“లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో దేశంలోనే తెలంగాణ హైకోర్టు మొదటి స్థానంలో ఉంది” అని వెల్లడించారు.

డిజిటలైజేషన్, ఆధునికీకరణ ప్రగతి

  • 10 జిల్లా కోర్టుల్లో డిజిటలైజేషన్ చేపట్టామని తెలిపారు.
  • హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశామని వెల్లడించారు.
  • ఇటీవల హైకోర్టు ప్రాంగణంలో “మీ సేవ” కేంద్రాలను ఏర్పాటు చేసి, కక్షిదారులకు మరింత సౌకర్యం కల్పించామని తెలిపారు.
  • ఉచిత వైఫై సేవలు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
  • హైకోర్టు నూతన భవనం కోసం నిధులు కేటాయించామని, ఆధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నామని తెలిపారు.

యువ న్యాయవాదులకు పిలుపు
“కీలక కేసుల వాదనలు పరిశీలించి, ప్రముఖ న్యాయవాదులను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ప్రక్రియలో యువ న్యాయవాదులు ప్రోత్సాహం పొందాలి” అని జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు.

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

తెలంగాణ హైకోర్టు ప్రగతిని ముందుకు తీసుకువెళ్లడంలో న్యాయమూర్తుల కృషి ముఖ్యమని, సేవా దృక్పథంతో న్యాయవ్యవస్థ మరింత ప్రజాకేంద్రంగా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *