వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వన్ నేషన్- వన్ ఎలక్షన్ పద్దతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు దేశానికి మేలు చేస్తాయని, ఇది పాలనలో సుస్థిరతను, విధానాలలో అనిశ్చితిని తొలగించేందుకు సహాయపడుతుందని చెప్పారు. కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయబడింది.
భారతదేశం ఆర్థిక రంగంలో కీలక స్థానంలో నిలిచిందని, “గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్”లో భారతదేశం 39వ స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి చెప్పారు.
