ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన 8వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు.
బడ్జెట్ కేటాయింపులు – ముఖ్యమైన రంగాలు:
✅ రక్షణ శాఖ: ₹4,91,732 కోట్లు
✅ గ్రామీణాభివృద్ధి: ₹2,66,817 కోట్లు
✅ హోం శాఖ: ₹2,33,211 కోట్లు
✅ వ్యవసాయం & అనుబంధ రంగాలు: ₹1,71,437 కోట్లు
✅ ఆరోగ్య శాఖ: ₹98,311 కోట్లు
✅ పట్టణాభివృద్ధి: ₹96,777 కోట్లు
✅ ఐటీ & టెలికాం: ₹95,298 కోట్లు
✅ విద్యుత్: ₹81,174 కోట్లు
✅ వాణిజ్యం & పరిశ్రమలు: ₹65,553 కోట్లు
✅ సామాజిక సంక్షేమం: ₹60,052 కోట్లు
బడ్జెట్ హైలైట్స్:
🔹 పన్నుల పరంగా:
- కొత్త పన్ను విధానంలో ₹12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు.
- వృద్ధులకు వడ్డీపై TCS మినహాయింపు.
- వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను (Income Tax) బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటింపు.
🔹 వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి:
- కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి ₹3 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంపు.
🔹 ఆరోగ్య & ఔషధ రంగం:
- 36 కీలక ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు.
- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పన.
🔹 బీమా & పెట్టుబడులు:
- బీమా రంగంలో ఎఫ్డీఐ (Foreign Direct Investment) పరిమితిని 100%కి పెంపు.
తొలిసారి ₹50 లక్షల కోట్ల భారీ బడ్జెట్!
- మొత్తం బడ్జెట్ వ్యయం: ₹50,65,345 కోట్లు
- రెవెన్యూ వసూళ్లు: ₹34,20,409 కోట్లు
- మూలధన వసూళ్లు: ₹16,44,936 కోట్లు
- అప్పులు & ఇతర వసూళ్లు: రూ.28.37 లక్షల కోట్లు
