“కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు” – కేటీఆర్
పరిగి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం (ఫిబ్రవరి 1) పరిగిలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, “కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి గురువు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి తెలుసు. వారిని అడిగితేనే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారు” అని వ్యాఖ్యానించారు.
🔹 “కేసీఆర్ కర్ర లేకుండానే నిలబడతారు. కానీ రేవంత్ రెడ్డి కమీషన్ లేకుండా పాలించగలరా?” అని ప్రశ్నించారు.
🔹 “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని మండిపడ్డారు.
🔹 “నా సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. ఇది ప్రజలను మోసం చేసినట్టే” అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
