సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ – ఏమి చర్చించారో ఆసక్తి
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో నిర్వహించబడింది. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల
ఈ భేటీకి సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేయడంతో, సద్గురు – సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సిద్దం
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం నేతలతో కీలక సమావేశాలు జరుపనున్నట్లు తెలుస్తోంది.
సద్గురు – సీఎం భేటీపై అధికారిక వివరాలు వెలుబడకపోయినా, ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
