Breaking News

Ramgopal Varma appeared before the police for the investigation in the inappropriate posts case

పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ

సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో రాంగోపాల్ వర్మ పోలీసుల ఎదుట హాజరు

ఒంగోలు: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్ బాబు నేతృత్వంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.

‘వ్యూహం’ చిత్రంతో వివాదం

గత ఎన్నికలకు ముందు వైకాపాకు అనుకూలంగా ‘వ్యూహం’ చిత్రాన్ని రూపొందించిన ఆర్జీవీ, ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

టీడీపీ నేత ఫిర్యాదు – కేసు నమోదు

ఈ పోస్టులపై మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

వర్మ గైర్హాజరు – పోలీసులు అరెస్టుకు ప్రయత్నం

విచారణకు హాజరు కావాలని గతంలోనే నోటీసులు పంపినప్పటికీ, తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానంటూ వర్మ వాట్సాప్ ద్వారా సమాచారం పంపి గైర్హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆయన అరెస్టుకు ప్రయత్నించగా, కొన్నాళ్లపాటు వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కోర్టు ఉత్తర్వులు – విచారణకు హాజరు

తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన వర్మకు బెయిల్ మంజూరైంది. అయితే పోలీసులకు సహకరించాలని, విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

నేడు విచారణ – వైకాపా నేతతో భేటీ చర్చనీయాంశం

తాజాగా, పోలీసుల నోటీసుల నేపథ్యంలో వర్మ ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అయితే వర్మ విచారణకు ముందే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

ఈ కేసు విచారణపై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *