కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి కాలేజీలో విద్యార్థిని అదృశ్యం – తీవ్ర ఆందోళన
జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. జగిత్యాల జిల్లాలోని ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం అయినట్లు సమాచారం.
24 గంటలు గడిచినా పోలీసుల స్పందన లేపం
నిన్న సాయంత్రం నుంచి 24 గంటలు గడుస్తున్నా, పోలీసులు, కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
తన బిడ్డను అప్పగించాలని తల్లిదండ్రుల నిరసన
తన కూతురు జాడ తెలియక విలవిలలాడుతున్న తల్లిదండ్రులు, నరేందర్ రెడ్డి కాలేజీ వద్ద నిరసనకు దిగారు. ఇంత వరకు కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు త్వరగా స్పందించి విద్యార్థిని ఆచూకీ కనుగొనాలని స్థానికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
