Breaking News

"We will intensify movement if BC reservations are not legalized"

“బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం”

“బీసీలకు 42% రిజర్వేషన్ లేకపోతే సీఎం రేవంత్ చిట్టా విప్పుతాం” – రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ వ్యతిరేకిగా మారారని, బీసీలను అణగదొక్కే కుట్ర జరుగుతోందని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) ఆరోపించారు.

“బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం”

“బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ చిట్టా విప్పుతాం” అని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

“కుల గణనలో పెద్ద కుట్ర”

“తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన పూర్తిగా తప్పుల తడకగా మారింది. బీసీ జనాభాను తక్కువగా చూపించి, అన్ని రంగాల్లో వారిని వెనక్కి నెట్టే కుట్ర జరుగుతోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కుల గణనలో బీసీల శాతం తగ్గించి చూపించారు” అని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోన్న సీఎం రేవంత్”

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కుల గణనలో అనేక లోపాలు ఉన్నాయి, అనేక కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు” అని కృష్ణయ్య ఆరోపించారు.

“స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్?”

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని” ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ (BRS), బీజేపీలు (BJP) కూడా బీసీలకు 42% టికెట్లు కేటాయిస్తారా? అనే సవాల్ విసిరారు.

“ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి?”

సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్, బీజేపీ ఎలా స్పందిస్తాయి? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త ప్రకంపనలు సృష్టించాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *