Breaking News

"Kejiwal can't listen to me" – Hazare

“కేజీవాల్ నా మాట వినలేడు” – హజారే

ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే స్పందన – ఆప్ ఓటమికి లిక్కర్ పాలసీయే కారణం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వెనుకబడి పోతున్నది. ఈ పరిస్థితిపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.

“కేజీవాల్ నా మాట వినలేడు” – హజారే

శనివారం మీడియాతో మాట్లాడిన అన్నా హజారే, కేజీవాల్ తన హెచ్చరికలను పట్టించుకోలేదని ఆరోపించారు.

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

“ఒక నాయకుడి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. నిజాయితీ, త్యాగం అనేవి ప్రజల నమ్మకాన్ని పెంచుతాయి. కానీ, ఆప్ ప్రభుత్వం మద్యం పాలసీ, డబ్బు కుంభకోణాల్లో మునిగిపోయింది. కేజీవాల్ ప్రతిష్ట దెబ్బతినడంతో ఎన్నికల్లో ప్రజలు తక్కువ ఓట్లు వేశారు”, అని ఆయన వ్యాఖ్యానించారు.

“కేజీవాల్ డబ్బు, అధికారంలో మునిగిపోయాడు”

  • అన్నా హజారే తెలిపిన వివరాల ప్రకారం, కేజీవాల్ తన లిక్కర్ పాలసీ పై ఎక్కువ దృష్టి సారించాడని, అది ఆప్ పార్టీకి పెద్దదెబ్బ తగిలించిందన్నారు.
  • “నేను ఇదే విషయాన్ని ముందే చెప్పాను. కానీ, కేజీవాల్ పట్టించుకోలేదు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాకుండా, ఆయన డబ్బు, అధికారంపైనే దృష్టి పెట్టారు. అందుకే ప్రజలు అతనికి తగిన బుద్ధి చెప్పారు”, అని ఆయన వ్యాఖ్యానించారు.

“నిజం ఎప్పుడూ వెలుగులోకి వస్తుంది”

  • “రాజకీయాల్లో ఆరోపణలు సహజం. కానీ, నిజాయితీ గల నాయకుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కేజీవాల్ విషయంలో ప్రజలు అన్ని నిజాలు గమనించారు”, అని హజారే అభిప్రాయపడ్డారు.
  • “లిక్కర్ కుంభకోణం కారణంగా, కేజీవాల్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇది ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది” అని హజారే వ్యాఖ్యానించారు.

ఎన్నికల తాజా పరిస్థితి

  • భాజపా – 43 స్థానాల్లో ఆధిక్యంలో
  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – 27 స్థానాల్లో ముందంజ
  • కాంగ్రెస్ (INC) – ఖాతా తెరవలేకపోయింది

ఈ ఫలితాలు AAPకి భారీ ఎదురుదెబ్బగా మారగా, భాజపా దిల్లీ పీఠాన్ని దక్కించుకునే దిశగా వెళుతోంది.

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *