|| Listening to Botsa’s words, it is as if demons are described in the Vedas – Sharmila ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత బొత్స సత్యనారాయణ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “బొత్స మాటలు వింటుంటే, దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా అనిపిస్తోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వైసీపీ పాలనపై షర్మిల ఫైర్
“ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పగిస్తే, ఖాళీగా కూర్చున్నది ఎవరో, పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో అందరికీ తెలుసు” అని షర్మిల మండిపడ్డారు. “యువత భవిష్యత్తును పణంగా పెట్టి ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రపోయింది. ప్రజల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించింది” అని విమర్శించారు.
“పార్టీ సిద్ధాంతాలకు, తండ్రి ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుని, బీజేపీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రజల సంపదను ప్యాలెస్లకు మళ్లించుకున్నారు. ఐదేళ్లు ఖాళీగా గడిపి, ఎన్నికల ముందు సిద్ధమన్నట్టు బయటకు వచ్చారు. పని చేయకపోయిన ప్రజలు మిమ్మల్ని పనికి రానివ్వకుండా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పారు” అని షర్మిల ఎద్దేవా చేశారు.
వైసీపీ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకెళ్తుందని, రాష్ట్రానికి మళ్లీ న్యాయమైన పాలన రావాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షర్మిల సూచించారు.
