Breaking News

రంగంలోకి సీపీ.. పోలింగ్ కేంద్రాల తనిఖీ

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీ గౌష్ ఆలం బుధవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నగరంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది కి సూచించారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *