Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన, బీర్ల అయిలయ్య , చామల కిరణ్ కుమార్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి . మర్యాదపూర్వకంగా కలిశారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల చైర్మన్,వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డిగారికి కానుకగా ఇస్తామన్న మాట మేరకు రేవంత్ రెడ్డి కలసి పలు అంశాలను చర్చించారు.ఆ తర్వాత జనగామ మున్సిపాలిటీలో బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పిన సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ని ఎంపిక చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కానుకగా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం తో పాటు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని వాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ జనగామ పార్టీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం పలు అంశాలను చర్చించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు..

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు స్పీడ్.. అదనపు భూసేకరణకు సర్కార్ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *