Breaking News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆలేరు మున్సిపల్ చైర్మన్

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని గెలిచిన తర్వాత తుంగలో తొక్కే నాయకులు ఉంటారు.

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్.ఆలేరు పట్టణ కేంద్రంలో మార్కండేయ గుడి దగ్గరలో కంపచెట్లు పిచ్చి మొక్కలు చెత్తాచెదారం ఉండడం వలన పాములు తేళ్లు విషపురుగులు ఇండ్లలోకి వస్తున్నాయి.అది గమనించి ఎన్నికల ముందే గెలవగానే మొదటి పని సొంత నిధులతో జెసిబి ని తీసుకొచ్చి పిచ్చి మొక్కలను ముండ్ల కంపలను తొలగించి పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం రోజు స్టార్ట్ అయిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చింతకింది సిద్దులు,రేగోటి వెంకటేష్, బేతి వెంకటేష్, చింతకిందిగిరి, ఎలగందుల యాదగిరి,భేతి సత్యనారాయణ, బేతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *