Breaking News

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపు కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈనెల 16న బుగ్గ అటవీ ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు బుగ్గ ప్రాంతం భక్తులతో రద్దీగా మారడంతో అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. బుగ్గ గూడెం, గొండుగూడెం, అంకుశం అటవీ మార్గాల్లో బోనాలు సమర్పించి వనభోజనాల అనంతరం భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలు వదిలేసి వెళ్లారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం తో ఈసారి (ప్లాస్టిక్ వ్యర్ధాలు) చెత్తను తొలగించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త నిలువలను తొలగించేందుకు మరో వారం రోజులు పడుతుందని బుగ్గ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ దూడం మహేష్ తెలిపారు. బుగ్గ గూడెం, కన్నాల, తాండూర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను డంపింగ్ యార్డ్ లకు తరలించే పనులను చేపడుతున్నారు.

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *