Breaking News

కరాటే ఛాంపియన్షిప్ లో రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కు ఎంపికైన కిట్స్ విద్యార్థినులు.

కోదాడ, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక.): కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కరాటే లో రాష్ట్ర స్థాయి సిఎం కప్ కు కిట్స్ కళాశాల విద్యార్థి నులు ఎంపిక అయినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు.సూర్యాపేట లో నిర్వహించిన కరాటే ఛాంపియన్షిప్ పోటీలో సీనియర్ విభాగంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఎం. వైభవి బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కు ఎంపిక అయ్యినట్టు మరియు జూనియర్ స్థాయి లో డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతున్న దీపిక బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కు ఎంపిక అయ్యినట్టు తెలిపారు.మరియు జూనియర్ విభాగం లో జె. రవళి, ఎం. అంజలి, . దీపిక వెండి పతకాలు సాధించినట్టు తెలిపారు.కరాటే ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కి ఎంపికయినా విద్యార్థినులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు.ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత అభినందించారు.

గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి: సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.

రైతులకు రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *